బేస్ రేట్ పెంచిన యాక్సిస్ బ్యాంకు
ప్రైవేటు రంగంలోని యాక్సిస్ బ్యాంక్ కనీస వడ్డీ రేటు (బేస్ రేటు)ను పెంచినట్లు నేడు(గరువారం) ప్రకటించింది.
ప్రైవేటు రంగంలోని యాక్సిస్ బ్యాంక్ కనీస వడ్డీ రేటు (బేస్ రేటు)ను పెంచినట్లు నేడు(గరువారం) ప్రకటించింది. బేస్ రేటు 30 బీపీఎస్ పాయింట్లు పెంచుతున్నట్లు యాక్సిస్ బ్యాంక్ వెల్లడించింది. ఇక దీంతో బేస్ రేటు 9.2 శాతం నుంచి 9.5 శాతానికి పెరించింది. అదే విధంగా మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్ ఆధారిత రేటును (ఎంసిఎల్ఆర్)ను ఎప్పటిలాగే ఉంచినట్లు వెల్లడించింది. పెంచిన బేస్రేటు నేటి నుండి అమల్లోకి రానుందని యాక్సిస్ బ్యాంక్ రెగ్యులేటరీ సమాచారంలో వెల్లడించింది.