తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై ఎంఐఎం అధినేత ఒవైసీ ప్రశంసల వర్షం కురిపించారు. కేసీఆర్ కారణంగానే దేశంలో ప్రస్తుతం చాలా మంది ఫెడరల్ ఫ్రంట్ గురించి మాట్లాడుతున్నారని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. కేసీఆర్ సరైన దిశలోనే పయనిస్తున్నారని కేసీఆర్ టార్గెట్ సరిగ్గానే ఉందని అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ఫెడరల్ ప్రంట్ ఏర్పాటు కోసమే కేరళ సీఎం విజయన్తో పాటు డీఎంకె చీఫ్ స్టాలిన్తో కేసీఆర్ సమావేశమైనట్టుగా ఆయన గుర్తు చేశారు.