గుంటూరు సభకు వైసీపీ స్పాన్సర్‌ షిప్‌ ఉంది: మంత్రి కాల్వ

Update: 2019-02-10 10:59 GMT

ప్రధాని హోదాలో నరేంద్ర మోడీ గుంటూరు సభలో మాటల గారడీ చేశాడని మంత్రి కాల్వ శ్రీనివాసులు మండిపడ్డారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు, ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకుండా దగా చేశారని ఆరోపించారు. అనంతపురంలో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి కాల్వ శ్రీనివాసులు పాల్గొన్నారు. నాలుగున్నర ఏళ్లు ఏపీ ప్రజలను నమ్మించి టీడీపీని మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు సభకు వైసీపీ స్పాన్సర్‌ షిప్‌ ఉందని ఆయన ఆరోపించారు.

Similar News