ఏపీలో సీబీఐకి గ్రీన్ సిగ్నల్.. జీవో జారీచేసిన జగన్ ప్రభుత్వం!

Update: 2019-06-06 10:32 GMT

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. సీబీఐ ప్రవేశాన్ని నిషేధిస్తూ గత ప్రభుత్వం జారీ చేసిన జీవోను రద్దు చేశారు. టీడీపీ ప్రభుత్వంలో సీబీఐను రాష్ట్రంలోకి వ్యతిరేకిస్తూ అప్పటి సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఐటీ, సీబీఐ దాడులతో తెలుగుదేశం పార్టీని ఇబ్బందులు పెడుతున్నారని గతంలో కేంద్రంపై చంద్రబాబు విమర్శలు గుప్పించారు. అప్పట్లో చంద్రబాబు తీసుకున్న నిర్ణయంతో సుమారు ఆర్నెళ్లకు పైగా సీబీఐ అధికారులు ఏపీలోకి రాలేదు. ఏపీలో సీబీఐ ప్రవేశానికి అనుమతిస్తూ కొత్త ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. దాంతో ఆంధ్రప్రదేశ్‌లో సీబీఐ ఎంట్రీకి మార్గం సులభమైంది.

Tags:    

Similar News