అమరావతికి చేరిన రాజంపేట పంచాయతీ...మేడా వైసీపీలోకి వెళ్తారని జోరుగా ప్రచారం
కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం టీడీపీ పంచాయతీ రాజధానికి చేరింది. విజయవాడ చేరుకున్న రాజంపేట టీడీపీ ముఖ్యనేతలు కాసేపట్లో సీఎం చంద్రబాబుతో భేటీ కానున్నారు. చంద్రబాబుతో సమావేశానికి మాజీ మంత్రి బ్రహ్మయ్య, మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడు, వేమన సతీష్ హాజరుకాగా సిట్టింగ్ ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి గైర్హాజరయ్యారు. ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి పార్టీని వీడటం ఖాయమని రాజంపేట నేతలు చెబుతున్నారు.