పలు జిల్లాలో గంటపాటు కేబుల్ ప్రసారాల నిలిపివేత
ఏపీ కేబుల్ ఆపరేటర్స్ నిరసనబాట పట్టారు.
ఏపీ కేబుల్ ఆపరేటర్స్ నిరసనబాట పట్టారు. ఏపీలోని పలు జిల్లాలో నేడు ఉదయం ఒక గంటపాటు కేబుల్ ప్రసారాలు నిలిపివేసినట్లు ఏపీ మల్టీ సిస్టమ్ ఆపరేటర్స్ వెల్ప్ర్ ఫెడరేషన్ వెల్లడించింది. కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ విజయ్ కృష్ణన్ ఏపీ మల్టీ సిస్టమ్ ఆపరేటర్స్ పై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా గంటపాటు కేబుల్ ప్రసారాలను నిలిపేశారు. కేబుల్ ఆపరేటర్లపై పరుష పదాజాలన్ని వాడిన సంగతి తెలిసిందే. కాగా ఫైబర్ గ్రిడ్ను ప్రమోట్ చేయడం లేదంటూ కూడా కేబుల్ ఆపరేట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అవసరమైతే కేబుల్ ఆపరేటర్లు, ఎమ్మెస్వోలు కేసులు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. అయితే దీనిపై విజయ్ కృష్ణన్ స్పందించకపోవడంతో ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. కేబుల్ ప్రసారాలు నిలిపివేసినందుకు ఎమ్మెస్వోలకు, కేబుల్ ఆపరేటర్లకు ఏపీ ఎమ్మెస్వోల సంఘం ధన్యవాదాలు తెలిపింది.