హైదరాబాద్లో ఖైరతాబాద్ కూడలి వద్ద ఏపీ పోలీసుల మధ్య పెనుగులాట జరిగింది. ఏపీఎస్పీ 11వ బెటాలియన్ కానిస్టేబుల్ మధును నలుగురు పోలీసులు బలవంతంగా విజయవాడకు తరలించే ప్రయత్నం చేయడంతో అతడు ఖైరతాబాద్ కూడలి వద్ద జీపు నుంచి కిందకు దూకాడు మధుని బలవంతంగా తిరిగి జీపులోకి ఎక్కించేందుకు ప్రయత్నించారు. వదిలేయమని వేడుకున్నా పట్టించుకోలేదు దీంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది. చుట్టుపక్కల వారు జోక్యం చేసుకోవడంతో మధుని వదిలేసి పోలీసులు వెళ్లిపోయారు.