ఏపీ ప్రభుత్వం ఈసీల మధ్య మరో వివాదం రాజుకుంది. ఇంటెలిజెన్స్ డీజీని బదిలీ చేయాలంటూ సీఈసీ జారీ చేసిన ఆదేశాలను ఏపీ ప్రభుత్వం పక్కన పెట్టింది. ఇంటెలిజెన్స్ డీజీ బదిలీని నిలిపివేసిన ఏపీ ప్రభుత్వం శ్రీకాకుళం, కడప ఎస్పీలను బదిలీ చేస్తూ జీవో జారీ చేసింది. ఇద్దరు ఎస్పీలను బదిలీ చేస్తూ ఏపీ సీఎస్ జీవో జారీ చేశారు. ఎన్నికల నిబంధనల ప్రకారం ఇంటెలిజెన్స్ డీజీ ఎన్నికల సంఘం పరిధిలోకి రారని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. ఈ మేరకు డీజీపీ రాసిన లేఖను సీఈసీకి పంపిణ సీఎస్ స్పష్టత ఇచ్చే వరకు బదిలీ చేయకూడదని నిర్ణయించింది.
ఈసీ నిర్ణయంపై తీవ్రంగా స్పందించిన ఏపీ ప్రభుత్వం ఇవాళ కొత్త జీవో విడుదల చేసింది. ఎన్నికల విధుల్లో ఉన్న పోలీసులు మాత్రమే ఈసీ పరిధిలోకి వస్తారంటూ నిన్న విడుదల చేసిన జీవో నెంబర్ 716 ను రద్దు చేస్తూ ఇవాళ కొత్త జీవో నెంబర్ 720 ను విడుదల చేసింది. తాజా జీవోలో ఇంటలిజెన్స్, కౌంటర్ ఇంటలిజెన్స్ ప్రస్తావన లేకపోవడం గమనార్హం. ఇవాళ్టి జీవోతో ఏబీ వెంకటేశ్వరరావును తప్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు.