దేశానికి రెండోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసారు మోడీ .ఆయనతో పాటుగా పలువురు ఎంపీలుకూడా ప్రమాణస్వీకారం చేసారు . ఇక కేంద్రమంత్రి వర్గంలో అమిత్ షా కూడా ఉన్నారు . అయితే ఆయనకు ఆర్థిక శాఖ, కార్పొరేట్ వ్యవహారాల బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. గతంలో ఆర్థిక శాఖ మంత్రిగా అరుణ్ జైట్లీ ఉన్నారు . కానీ వయసు పై రిత్యా అయన ఈ ఎన్నికల్లో పోటి చేయలేదు .. ఇక అనూహ్యంగా కేబినెట్లో చోటు దక్కిన జైశంకర్కు విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ బాధ్యతలు ఇచ్చే అవకాశాలున్నాయి. ఆయన గతంలో ఇదే శాఖ కార్యదర్శిగా పని చేశారు.. స్మృతీ ఇరానీకి మహిళా, శిశు సంక్షేమ శాఖను అప్పగించే అవకాశం ఉంది. ఇక నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్, రాంవిలాస్ పాసవాన్, రవిశంకర్ ప్రసాద్, హర్సిమ్రత్ కౌర్ బాదల్కు పాత శాఖలనే కొనసాగించవచ్చునని సమాచారం .