సిఎం చంద్రబాబుపై వైసీపీనేత అంబటి రాంబాబు ఫైరయ్యారు. ఓటిమి భయంతో వ్యవస్థలను దోషులుగా చిత్రీకరించేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. గతంలో గెలిచినప్పుడు లేనిది ఇప్పుడు ఈవీఎంలపై నెపం నెట్టడం ఎంతవరకు కరెక్ట్ అన్నారు. లోకేష్ కోసం ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను పక్కకు నెట్టేశారని అన్నారు. లోకేష్ను ముఖ్యమంత్రి చేయాలనే చంద్రబాబు కల ఎప్పటికీ నేరవేరదన్నారు. ఎమ్మెల్యేలను కొన్నప్పుడు చంద్రబాబుకు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. ఏపీ ప్రజల ఓట్లు దొంగిలించేందుకే కోడెల శివప్రసాద్ పోలింగ్ బూత్లోకి వెళ్లి తలుపులు వేసుకున్నారని విమర్శించారు. కోడెల రిగ్గింగ్కు పాల్పడడం వల్లే ప్రజలు తిరగబడ్డారన్నారు. చంద్రబాబు దుష్ట పాలన అంతం అవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.