తాడేపల్లిలో జగన్ నిర్మించిన కొత్తింటి గృహప్రవేశం వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. నిన్న కొత్తింటి నిర్మాణాన్ని పరిశీలించిన జగన్ సతీమణి, వైఎస్ భారతి కొన్ని మార్పులు సూచించినట్టు తెలుస్తోంది. అయితే, ఈ నెల 14న గృహప్రవేశానికి ముహూర్తం ఖరారు చేసుకున్న జగన్ ఇంటి నిర్మాణం పూర్తికాకపోవడంతో గృహప్రవేశాన్ని వాయిదా వేసుకునే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.