మంచి రోజు చూసి తాను వైసీపీలో చేరతానని చెప్పారు చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్. తాను పార్టీ మారడానికి ఎన్నో కారణాలున్నాయని, అసలు ప్రభుత్వం చంద్రబాబు చేతిలో లేదని ఆయన చెప్పారు. ఎవరెన్ని కుట్రలు చేసినా తాను 2019లో వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలుస్తానంటున్నారు ఆమంచి కృష్ణమోహన్. లోటస్పౌండ్లో వైఎస్ జగన్తో భేటి అయిన ఆమంచి వివిధ అంశాలపై చర్చించారు. ఆమంచి రాజీనామాతో నియోజకవర్గ బాధ్యతను ఎమ్మెల్సీ కరణం బలరాంకు సీఎం చంద్రబాబు అప్పగించారు. తక్షణమే కార్యకర్తలతో సమావేశం నిర్వహించాలని సూచించారు.