తొలిదశ పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 20 రాష్ట్రాల్లోని 91 లోక్సభ స్థానాలతోపాటు పలుచోట్ల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకూ పోలింగ్ జరగనుంది. ఏపీలో 175 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాలు, తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు ఇవాళ పోలింగ్ జరుగుతుంది. ఓట్లేసేందుకు జనం భారీగా పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. ఇప్పటికే పలువురు ముఖ్య నేతలు ఓటు హక్కును వినియోగించుకోగా, సినీ పరిశ్రమ నుంచి కూడా చాలా మంది తరలి వస్తున్నారు. వీరిలో ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ తన కుటుంబ సభ్యులతో కలిసి జూబ్లీహిల్స్ ఓబుల్రెడ్డి స్కూల్లో కొద్దిసేపటి క్రితం ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే మరో హీరో అల్లు అర్జున్ కూడా ఓటు వేశారు.