నారాయణపేట జిల్లాలో విషాదం నెలకొంది. మట్టిదిబ్బలు కూలిపడటంతో 10 మంది ఉపాధికూలీలు దుర్మరణం చెందారు. ఉపాధి హామీ పనుల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. కుంటలు తవ్వుతుండగా మట్టిదిబ్బలు విరిగి కూలీల మీద పడడంతో 10 మంది మృతి చెందారు. అయితే, మృతులంతా మహిళలే కావడం గమనార్హం. ఎండ ఎక్కువగా ఉండడంతో వీరంతా గుట్టలాంటి ప్రదేశంలో సేద తీరుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులంతా పీలేరు గ్రామానికి చెందిన వారే. మృతదేహాలను శవపరీక్షల నిమిత్తం నారాయణపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
మృతులు వీరే..
1)పి. అనురాధ(30)
2) బీమమ్మ(40)
3) బుడ్డమ్మ(26)
4) బి.లక్ష్మి(28)
5) కె. లక్ష్మి(30)
6) మంగమ్మ(32)
7) అనంతమ్మ(45)
8) కేశమ్మ(38)
9) బి. అనంతమ్మ(35)
10) లక్ష్మి (28)