సంతోషం కలిగినా తాగడమే దుఖం కలిగిన తాగడమే .. మనసు బాగున్నా తాగడమే బాలేకున్నా తాగడమే .. పాయింట్ ఏదైనా తాగడం మాత్రం కామన్ .. ఇదే సూత్రాన్ని మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మందుబాబులు బాగా నమ్మిన్నట్టు ఉన్నారు.. అందుకేనేమో దేశంలో అత్యధికంగా మద్యం తాగే రాష్ట్రాల్లల్లో మొదటి రెండు రాష్ట్రాల్లో మన తెలుగు రాష్ట్రాలే నిలిచాయి .. ఇందులో ముందుగా ఆంధ్రప్రదేశ్ ఉండగా దాని తరవాత స్థానంలో తెలంగాణా ఉందని వైజ్గాయ్ రిపోర్ట్స్ సంస్థ పేర్కొంది. మన తెలుగు రాష్ట్రల తరవాతి స్థానంలో కేరళ, కర్నాటక, సిక్కిం, హర్యానా, హిమాచల్ప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి .. అయితే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో భాగంగా ఏపి సీఎం వైఎస్ జగన్ మద్యపాన నిషేధం చేస్తానని ఇచ్చిన హామీ నేపథ్యంలో మద్యం వినియోగంలో ఏపీ స్థానం భవిష్యత్లో దిగువకు వెళ్లే అవకాశముంది...