పశ్చిమ బంగాల్లోని బగ్డోగ్రా నుంచి కోల్కతాకు వెళ్తున్న ఎయిర్ ఏషియా విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. ఈ బెదిరింపు కాల్ను దుండగులు బెంగళూరు విమానాశ్రయానికి ఫోన్ చేసి తెలిపారు. అయితే ఎయిర్ ఏషియా ఐ 5 - 588 విమానం అప్పటికే 179 మంది ప్రయాణికులతో బగ్డోగ్రా నుంచి కోల్కతాకు బయలుదేరింది. దీంతో గమ్యస్థానం చేరుకోగానే ప్రయాణికులను హుటాహుటిన విమానం నుంచి దింపేశారు. తర్వాత విమానాన్ని ఓ ఖాళీ ప్రదేశంలో నిలిపి సోదాలు నిర్వహించారు. అయితే అది ఫేక్ కాల్ అని తేల్చారు. ఇటు కాల్ చేసిన దుండగుడి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.