స్కూల్‌లో అగ్నిప్రమాదం.. ముగ్గురు మృతి

Update: 2019-06-08 10:46 GMT

హర్యానాలో ఫరిదాబాద్‌లోని దబువాలో శనివారం ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. ఏఎన్‌డీ కాన్వెంట్‌ స్కూల్‌లో మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో శనివారం ఉదయం స్కూల్ కింది అంతస్తులో ఉన్న బట్టల దుకాణంలో మంటలు చెలరేగాయి. నికులే ధైర్యంచేసి స్కూల్ భవనం పైకప్పు గుండా వారిని బయటకు తీసుకొచ్చి ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటినా ఘటనస్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చింది. అగ్నిప్రమాదానికి గల కారణం తెలియాల్సి ఉంది. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని అగ్నిమాపక సిబ్బంది తెలిపింది. అగ్నిప్రమాదానికి గల కారణం తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News