రాజకీయ నేతలపై యువకుడి నిరసన

Update: 2019-04-07 08:03 GMT

కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలం అర్జవానిగూడెం గ్రామానికి చెందిన పాలడగు విజయరాజు వాటర్ ట్యాంక్ ఎక్కాడు. పెడన నియోజకవర్గంలో గెలిచిన నేతలు ఆస్తులు సంపాదించుకుంటున్నారు తప్ప హామీలు ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించాడు. మీడియా వస్తేనే కిందికి దిగుతానంటూ ట్యాంక్ పైనే తన నిరసనతో హల్ చల్ చేస్తున్నాడు. చుట్టు ప్రక్కన వాళ్లు నచ్చజెప్పిన కానీ వినకుండా బెదిరింపులకు గురిచేస్తున్నాడు. అయితే అతన్ని ట్యాంక్‌పై నుంచి కిందికి దించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. 

Full View

Similar News