నిజామాబాద్ జిల్లా బోధన్లో ఐపీఎల్ బెట్టింగ్ దందా కలకలం రేపుతోంది. బెట్టింగ్ డబ్బుల కోసం ఓ యువకుడిని నిర్బంధించిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బెట్టింగ్ విషయంలో బోధన్- కందకుర్తి యువకుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే యువకుడిని నిర్బంధించిన ఘటనలో మరో నలుగురిపై కేసు నమోదైంది. అయితే ఈ బెట్టింగ్ దందాపై పోలీసులు మౌనంగా ఉన్నారు.