జగన్ పై హత్యాయత్నం కేసును కేంద్ర సంస్థతో దర్యాప్తు చేయించాలని వైసీపీ నాయకులు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కోరారు. ఇవాళ ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో రామ్నాథ్ కోవింద్తో వైసీపీ బృందం భేటీ అయ్యింది. సుమారు అరగంట పాటు జరిగిన భేటీలో జగన్పై జరిగిన దాడిని రాష్ట్రపతికి వివరించారు. హత్యాయత్నంలో నిష్పపాక్షిక విచారణ జరగాలంటే థర్డ్ పార్టీతో కేసు దర్యాప్తు చేయించాలని రాష్ట్రపతికి విన్నవించామని వైఎస్సార్సీపీ నేతలు మీడియాకు వెల్లడించారు. కుట్రదారులు బయటపడాలంటే దర్యాప్తు ఏపీ ప్రభుత్వం పరిధిలో ఉండకూడదని వైసీపీ నాయకులు చెప్పుకొచ్చారు.