జగన్పై దాడి కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం ...నిందితుడు కాల్ డేటా ఆధారంగా పలువురికి నోటీసులు
ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన దాడి కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న శ్రీనివాసరావు అకౌంట్లను సిట్ బృందం తనిఖీ చేసింది. దర్యాప్తులో భాగంగా ఎస్బీఐ, విజయా, ఆంధ్రా బ్యాంకుల అకౌంట్లను పరిశీలించిన అధికారులు ... మొత్తం మీద 13 వందల 65 రూపాయలు ఉన్నట్టు గుర్తించారు. అయితే గత ఏడాది కాలంలో జరిగిన లావాదేవీలను కూడా పరిశీలించాలని నిర్ణయించారు. మరో వైపు నిందితుడి కాల్ డేటా ఆధారంగా పలువురిని ప్రశ్నించాలని సిట్ అధికారులు నిర్ణయించారు.