జగిత్యాల జిల్లా తాటిపెల్లిలో దారుణం జరిగింది. మద్యం మత్తులో ఇద్దరు డిగ్రీ విద్యార్ధులు కత్తులతో పరస్పరం దాడి చేసుకున్నారు. స్ధానికంగా ఉన్న ఓ ప్రయివేటు కళాశాలలో డిగ్రీ చదవుతున్న నవీన్, శ్రవణ్లు నిన్న రాత్రి మద్యం సేవించారు. తరువాత మాట మాట పెరగడంతో ఇరువురు కత్తులతో దాడికి దిగారు. ఈ ఘటనలో నవీన్ చనిపోగా ..శ్రవణ్ పోలీసుల ముందు లొంగిపోయాడు. సరిగ్గా నెల రోజుల క్రితం ఇద్దరు పదోతరగతి విద్యార్ధులు మద్యం మత్తులో ప్రాణాలు తీసుకున్న ఘటన మరువక ముందే ఈ ఘటన జరగడం తీవ్ర కలకలం రేపింది.