కృష్ణాజిల్లా వైసీపీలో రాజీనామాల వ్యవహారం కలకలం రేపుతోంది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం సీటును వంగవీటి రాధాకృష్ణకు ఇవ్వకపోవడంపై ఆయన అనుచరులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఉయ్యూరు కౌన్సిల్, జిల్లా ఫ్లోర్ లీడర్ పదవులకు వంగవీటి శ్రీనివాస ప్రసాద్ రాజీనామా చేశారు. జగన్ వైఖరిపై మనస్థాపంతో రాజీనామాలు చేస్తున్నట్టు చెబుతున్నారు. సెంట్రల్ సీటును మల్లాది విష్ణుకు కేటాయించే యోచనలో వైసీపీ అధిష్టానం ఉండటంతో అనుచరులు, పార్టీ నేతలతో వంగవీటి రాధాకృష్ణ చర్చలు జరుపుతున్నారు.