ఎన్నికల వేళ కారు జోరుకు సొంత పార్టీ నేతలే బ్రేకులు వేస్తున్నారు. రోజుకోకరు పార్టీకి బై కొట్టి కాంగ్రెస్కు జై కొట్టేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ రాములు నాయక్ .. పార్టీ వీడేందుకు సిద్ధమయ్యారు. రాహుల్ గాంధీ రాష్ట్ర పర్యటన సమయంలో కాంగ్రెస్లో ఆయన చేరనున్నారు. పార్టీని వీడేందుకు గల కారణాలు వివరించేందుకు మధ్యాహ్నం మూడు గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.