పాదయాత్రలో జగన్ ను కలిసిన టాలీవుడ్ టాప్ కమెడియన్

Update: 2018-05-29 06:46 GMT

వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని  టాలీవుడ్ టాప్ కమెడియన్ కలిశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న జగన్ ను కమెడియన్ పృద్విరాజు కలుసుకున్నారు. జగన్ వెంట కొంత దూరం నడిచిన అయన పాదయాత్ర తీరుపై ఆరాతీశారు. అంతకుముందు జగన్ క్యాంపుకు చేరుకున్న పృద్విరాజు అక్కడ అభిమానులతో కిక్కిరిసిపోవడంతో భీమవరం శివారులో కలిశారు. కాగా నాలుగు రోజుల కిందటే నటుడు పోసాని కృష్ణమురళి జగన్ పాదయాత్రలో పాల్గొన్నారు. ప్రస్తుతం జగన్ పాదయాత్ర భీమవరం నియోజకవర్గంలో సాగుతోంది. 

Similar News