‘సీఎం ఆఫ్‌ ది ఇయర్‌’గా మమతా బెనర్జీ

Update: 2018-12-21 07:31 GMT

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ స్కోచ్‌ ‘సీఎం ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డుకు ఎంపికయ్యారు. పశ్చిమబెంగాల్ లో చేపట్టిన పలు అభివృద్ధి పనులు, తను చేపట్టిన పథకాలు, మమతా తీసుకున్న నిర్ణయాలు మమతా బెనర్జీని అత్యుత్తమ ముఖ్యమంత్రిగా నిలబెట్టాయి. ఈ ఏడాది అత్యుత్తమ పాలన అందించినందుకు స్కోచ్ బృందం సీఎం ఆఫ్ ది ఇయర్ అవార్డు’కు మమత బెనర్జీ ఎంపికైనట్లు ట్వీట్‌ ద్వారా శుభాకాంక్షాలు తెలిపారు, సుపరిపాలన అందిస్తూ రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపారని మమతా బెనర్జీని ప్రశంసించారు. కాగా పట్టణాలు, పల్లెల అభివృద్ధి, పరిపాలనతో అత్యుత్తమంగా వ్యవహరించినందుకు గాను పశ్చిమబెంగాల్ సిఎం మమత బెనర్జీని ఈ అవార్డుకు ఎంపిక చేసినట్టు స్కోచ్ బృందం వెల్లడించింది.

Similar News