తెలంగాణ రాష్ట్రం మరో రికార్డు సాధించింది. సుపరిపాలనలో దేశవ్యాప్తంగా మూడో ర్యాంకు సాధించింది. అత్యవసర మౌలిక వసతులు, మానవాభివృద్ధి సహకారం, సామాజిక భద్రత, మహిళా-శిశు సంక్షేమం, శాంతిభద్రతల నిర్వహణ, పారదర్శకత, జవాబుదారీతనం, న్యాయకల్పన వంటి 30 అంశాల ఆధారంగా కేటాయించిన ర్యాంకుల్లో తెలంగాణ థర్డ్ ప్లేస్లో నిలిచింది. వరుసగా మూడో సంవత్సరం కూడా కేరళ మొదటి స్థానంలో, తమిళనాడు సెకండ్ ప్లేస్లో నిలువగా ఆంధ్రప్రదేశ్కు 9వ స్థానం దక్కించుకుంది. ఇక సుపరిపాలన ర్యాంకుల్లో మధ్యప్రదేశ్, జార్ఖండ్, బీహార్ అట్టడుగున నిలిచాయి.