ఏపీ, తెలంగాణకు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. 2013 భూసేకరణ చట్టానికి తూట్లు పొడిచారంటూ సామాజికవేత్త మేధా పాట్కర్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీం ఏపీ, తెలంగాణతోపాటు గుజరాత్, జార్ఖండ్కు నోటీసులు జారీ చేసింది. బలవంతంగా భూసేకరణ చేసేందుకు సవరణలు చేశారన్న మేధా పాట్కర్ కేంద్రం చేసిన చట్టానికి వ్యతిరేకంగా ఆర్డినెన్స్ తేవడం రాజ్యాంగ విరుద్ధమన్నారు.