ప్రత్యేకహోదా పై వైసీపీ సంచలన నిర్ణయం

Update: 2018-12-16 09:32 GMT

ఏపీ ప్రత్యేకహోదా విషయమై గత 2014 నుండి వైఎస్ఆర్‌సిపీ పోరాడుతోనూ ఉందని వైసీపీ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ తెలిపారు. ప్రత్యేహోదా విషయంలో అటు కేంద్రప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం (టీపీపీ) రెండూ పూర్తి విఫలమయ్యాని బోత్స విమర్శించారు. కాగా ప్రత్యేకహోదా అనేది ఏమన్న సంజీవనా  అని..? హేలానగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఈ 27న ఢీల్లీలో వంచనపై గర్జన దీక్షను నిర్వహిస్తామని బోత్స పేర్కొన్నారు. హైదరాబాద్ లోని వైసీపీ కార్యాలయంలో బోత్స సత్యనారాయణ వెల్లడించారు. వైసీపీ అధినేత జగన్ ప్రతిష్ఠత్మకంగా చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర వచ్చే ఏడాది జనవరి 09-10 తేదిలలో ముగుస్తుందని తెలిపారు. ఈ నేపథ్యంలో జగన్ కు సంఘీభావంగా ఏపీలోని అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ శ్రేణులు జనవరి 5,6,7 తేదీల్లో పాదయాత్ర చేపడుతారని బోత్స పెర్కోన్నారు. ఢిల్లీలో జరిగే వంచనపై గర్జన సభలో జగన్ హజరవుతరని బోత్స స్పష్టం చేశారు. 

Similar News