హైదరాబాద్ సనత్నగర్లో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. కూకట్పల్లి అమీర్పేట్ మార్గంలో మూసాపేట్ బ్రిడ్జీ దగ్గర సిటీ బస్ డివైడర్పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షణాల్లో జరిగిన ఈ ప్రమాదంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫూటేజ్ను పోలీసులు విడుదల చేశారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ముగ్గురు వ్యక్తులు రోడ్డు దాటే క్రమంలో డివైడర్పై నిల్చున్నారు. అయితే అదే సమయంలో కూకట్పల్లి నుంచి అమీర్పేట్ వస్తున్న ఆర్టీసీ బస్సు డివైడర్పై నిల్చున్న వారిని ఢీ కొట్టి ఎదురు రోడ్డుపైకి వచ్చింది.
ఇద్దరిపై నుంచి సిటీ బస్సు దూసుకెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. స్పాట్లోనే ఇద్దరు మృతిచెందారు. అయితే అదే సమయంలో డివైడర్ పక్క నుంచి మరో వాహనం రాకపోవడంతో.. భారీ ప్రమాదం తప్పినట్లైంది. అయితే డివైడర్ కూడా ఎత్తుగా లేకపోవడం కూడా ప్రమాదానికి కారణమని చెబుతున్నారు. మరోవైపు యాక్సిడెంట్పై ఆగ్రహించిన స్థానికులు డ్రైవర్ను చితక్కొట్టారు. తర్వాత పోలీసులకు అప్పగించారు. రెండు బస్సుల అద్దాలను ధ్వంసం చేశారు. భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.