కొడంగల్లో రేవంత్ రెడ్డికి షాక్ తగిలింది. టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం మహేందర్ రెడ్డి చేతిలో ఘోర పరాజయం పొందారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, నల్లగొండ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరాజయం పాలయ్యారు. టీఆర్ఎస్ నేత కంచర్ల భూపాల్ రెడ్డి 16,500 ఓట్ల మెజారిటీతో కోమటిరెడ్డిపై ఘనవిజయం సాధించారు. మరోవైపు గద్వాలలో కాంగ్రెస్ నేత డీకే అరుణ సైతం ఓటమి చవిచూశారు. కామారెడ్డిలో టీఆర్ఎస్ నేత గంపా గోవర్దన్ చేతిలో కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ పరాజయం పాలయ్యారు.