భారతంలో ధర్మరాజు తన సంపద, రాజ్యం ఓడి అనంతరం తన సతి ద్రౌపదిని పణమొడ్డి ఓడినట్లే జూదం(పేకాట)లో ఓడి భార్యను చెరబట్టించాడు ఓ మృగాడు. ఒడిశా లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలాసోర్ జిల్లా బలికూట్ చెందిన ఓ వ్యక్తికి ఏడేళ్ల కిందట వివాహం జరిగింది. అతని ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. మద్యం, జూదానికి బానిసయైన ఆ వ్యక్తి జూదంలో ఏకంగా భార్యను పణంగా పెట్టాడు. జూదంలో ఓడితే తన భార్యను నీ ఇంటికి పంపిస్తానని ఎదుటి వ్యక్తికి చెప్పాడు. అప్పటికే అతని భార్యపై కన్నేసిన ఆ వ్యక్తే ఈ ప్లాన్ వేశాడు. ఈ క్రమంలో అతనికి పూటుగా మద్యం తాగించాడు. అనంతరం జూదంలో ఓడించాడు. దీంతో తన భార్యను పంపమని భర్తకు ఆదేశించగా ఇంట్లో ఉన్న సదరు మహిళను జుట్టు పట్టి ఈడ్చుకొచ్చాడు ఆ మృగాడు.. బలవంతంగా అతనిచేత అత్యాచారం జరిపించాడు. ఈ ఘోరంపై మొదట ఫిర్యాదు చేయకూడదని భావించినా భర్త చేసిన మోసానికి శిక్ష వేయించాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది మహిళ.