కత్తి మహేష్.. ప్రస్తుతం వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా మారారు. పవన్ కళ్యాణ్ అభిమానులతో రగడ ఆయనకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. మొదట్లో సోషల్ మీడియా ద్వారానే స్పందింన మహేష్.. ఇటీవల బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి పవన్, పూనమ్ కౌర్పై తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో అటు పవన్ అభిమానులే కాక చాలా మంది కత్తిపై కారాలు, మిర్యాలు నూరారు. ఈ క్రమంలో సంక్రాంతి సీజన్ రావడం..
తన స్వగ్రామంలో జరిగే సంక్రాంతి సంబరాల్లో పాల్గొనేందుకు సొంత ఊరికి వెళుతుంటే, పవన్ కల్యాణ్ అభిమానులు తన వెంటపడ్డారని కత్తి మహేష్ కొద్ది సేపటి క్రితం ట్వీట్ చేశాడు. "నేను ఇప్పుడే మా గ్రామానికి చేరుకున్నా. దారి మధ్యలో పీలేరు సమీపంలో ఇద్దరు బైకర్లు నన్ను గుర్తు పట్టి, కారును వెంబడించడంతో పాటు 'జై పవన్ కల్యాణ్' అని నినాదాలు చేశారు. నేను ఇంటికి వచ్చిన తరువాత నాకు అర్థమైంది ఏమంటే, ఇటీవల నాకోసం విజయవాడ, తిరుపతి, మదనపల్లి, పుత్తూరు ప్రాంతాల నుంచి మా గ్రామానికి పవన్ అభిమానులు వచ్చి నాకోసం వెతికారు" అని వెల్లడించాడు.
Just reached my village. On the way at Pileru two bikers tried to follow the car shouting "Jai Pawan Kalyan". As I reach, I am given to understand that PK fans from Vijayawada, Tirupathi, Madanapalle and Puttur visited my village recently.
— Kathi Mahesh (@kathimahesh) January 13, 2018