జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కీలక వ్యాఖ్యలు

Update: 2018-03-07 08:27 GMT

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రంతో సయోధ్య ఉంటే తప్పు లేనపుడు ఇద్దరు ముఖ్యమంత్రులు సయోధ్యతో ఉంటే తప్పేంటని పవన్‌ కల్యాణ్ ప్రశ్నించారు. అందర్నీ కలుపుకొని హోదా ఉద్యమాన్ని భూజాన వేసుకుందామని అనుకుంటే మిగిలిన వారు ఆఖరు వరకు నిలబడతారన్న నమ్మకం లేదన్నారు. చేసిన తప్పును సరి చేసుకోవడానికే రాహుల్ గాంధీ హోదాపై తొలి సంతకమంటూ ప్రకటించారని తెలిపారు. హోదాను అన్ని పార్టీలు స్వప్రయోజనాల కోసం వాడుకుంటున్నాయన్న పవన్‌ ఈ నెల 14 పార్టీ ఆవిర్భావ సభలో జనసేన భవిష్యత్‌ ప్రణాళికను ప్రకటిస్తానన్నారు.
 

Similar News