చినజీయర్ స్వామికి తృటిలో తప్పిన పెను ప్రమాదం

Update: 2018-12-20 07:02 GMT

శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామికి పెను ప్రమాదం తృటిలో తప్పింది. కొత్తపేటలోని అష్టలక్ష్మి ఆలయంలో  వైకుంఠ ఏకాదశి సందర్బంగా గోపుర పూజ నిర్వహిస్తూ ఉండగా స్టేజి ఒక్క సారిగా కుప్పకూలింది. ఈ వేదికపై ఎక్కువ మంది చేరడంతో కూలినట్టు ఆలయ వర్గాలు చెబుతున్నాయి. ఆలయం చుట్టూ కట్టిన స్టేజ్ లాంటి నిర్మాణం కూలిపోవడంతో చినజీయర్ స్వామి, ఇతర పూజారులు ఒక్కసారిగా పడిపోయారు. అయితే మధ్యలో పట్టు దొరకడంతో అందరూ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.  

Similar News