బుట్టా రేణుకపై అనర్హత వేటువేయాలి

Update: 2018-07-17 11:38 GMT

టీడీపీలోకి ఫిరాయించిన ఎంపీ బుట్టా రేణుకను వైసీపీ డిప్యూటీ లీడర్‌గా అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానించడమేంటని వైసీపీ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. ఎన్డీఏ నుంచి బయటికి వచ్చినా, టీడీపీ-బీజేపీ లాలూచీ ఇంకా కొనసాగుతుందని, కుమ్మక్కు  రాజకీయాలు కొనసాగుతున్నాయనడానికి ఇంతకంటే రుజువేంకావాలన్నారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన బుట్టా రేణుకపై అనర్హత వేటు వేయాలని కోరారు. మరోవైపు ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు, విభజన హామీలను అమలు చేయాలని ప్రధాని సమక్షంలోనే విజయసాయిరెడ్డి కోరారు.

Similar News