ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఆమరణ దీక్ష చేస్తున్న సీఎం రమేష్కు సొంత రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా మద్దతు లభిస్తోంది. స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలంటూ కడపలో దీక్ష చేస్తున్న సీఎం రమేష్కు డీఎంకే ఎంపీ, కరుణానిధి కుమార్తె కనిమొళి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె...ఆంధ్రప్రదేశ్ హక్కుల పోరాటానికి తమ మద్దతు ఉంటుందని ప్రకటించారు. సీఎం రమేష్ విభజనకు వ్యతిరేకంగా పార్లమెంటులో పోరాడారని గుర్తుచేశారు. కేంద్రం మాట మీద నిలబడి ఉంటే ఈపాటికి విభజన చట్టంలో హామీలన్నీ నెరవేరేవని చెప్పారు. బీజేపీకి హిందుత్వం తప్ప దేశ క్షేమం పట్టదని కనిమొళి ధ్వజమెత్తారు.