ఉత్తరప్రదేశ్ లోని బీఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రెండో సంవత్సరం విద్యార్థిని పరిక్ష రాయడానికి లిఫ్ట్లో కిందకు వస్తుంది ఇదే క్రమంలో వర్సిటీ పారిశుధ్య కార్మిక యువకుడు అదే లిఫ్ట్లో ఎక్కి విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించి లైంగిక వేధింపులకు గురిచేశాడు. దింతో విద్యార్థిని భయపడిపోయి కేకలు పెట్టగా అతను పారిపోయాడు. దింతో విద్యార్థిని వార్డన్కు ఫిర్యాదు చేసింది. సీసీ పుటేజీలు పరిశీలించగా అర్జున్ అనే కార్మికుడే ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు స్పష్టమైంది. ఇంతజరిగిన దుండగుడిపై చర్యలు తీసుకొకపోవడంతో విద్యార్థులు ఆందోళన బాటపట్టారు. రాత్రి 9 గంటల హాస్టల్ ఎదుట కూర్చుని నిరసన తెలిపారు. విద్యార్థులు రోడ్లపైకి వెళ్లకుండా యాజమాన్యం కంచె వేసింది. దీంతో ఆగ్రహించిన విద్యార్థులు కంచెను తొలగించి రోడ్డుపైకి దూసుకెళ్లారు. సమాచారం తెలుసుకున్న వండలూరు డీఎస్పీ విద్యార్థినులతో మంతనాలు జరిపి లైంగికవేధింపులకు పాల్పడిన కార్మికునిపై చర్య తీసుకుంటామని వాయిదావేసిన సెమిస్టర్ను వచ్చే ఏడాది జనవరిలో నిర్వహిస్తామని వర్సిటీ యాజమాన్యం అంగీకరించింది. దీంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. శుక్రవారం ఉదయం నిందితుడు నిందితుడిని అరెస్ట్ చేశారు.