తాజాగా ఐదు రాష్ట్రాలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు జరిగి ఫలితాలు కూడా వెల్లడించిన విషయం తెలిసిందే. కాగా మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో ఓ అభ్యర్ధి కేవలం మూడంటే మూడే ఓట్ల తేడాతో విజయం తన సొంతం చేసుకున్నారు. మిజోరం నేషనల్ ఫ్రంట్కు చెందిన లాల్చందమా రత్లే తువల్ నియోజకవర్గం నుంచి గెలుపు జెండా ఎగరవేశారు. కేవలం మూడు ఓట్ల తేడాతో నెగ్గడమే విశేషం. లాల్చందమాకు 5207 ఓట్లు పోలవ్వగా, ఆయన ప్రత్యర్థి ఆర్ఎల్ పన్వామియాకు 5204 ఓట్లు పోలయ్యాయి.