ఇటివలే టీఆర్ఎస్ పార్టీకి గుడై బై చెప్పి కాంగ్రెస్ తీర్థంపుచ్చుకున్న చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వేర్ రెడ్డి తాజాగా టీఆర్ఎస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నాతో పాటు ఇంకా టీఆర్ఎస్ పార్టీలో చాలా మంది అసంతృప్తిలో ఉన్నారని, జితేందర్ రెడ్డి, కేశవరావు వంటి కీలక నేతలు టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నారని వెల్లడించారు. తాజాగా ఆర్బీఐ కూడా తెలంగాణను కెసిఆర్ అప్పుల ఊబిలో పడేసారని స్పష్టం చేశారని గుర్తుచేశారు. ఒకప్పుడు జైతెలంగాణ అన్న నాయకులుంతా నేడు జై కెసిఆర్, కెటిఆర్ అంటున్నారని ఎద్దేవ చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్లో ఆత్మగౌరవం దెబ్బతినడం వల్లనే ఆ పార్టీకి రాజీనామా చేశానని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ జాతీయ హోదాపై పార్లమెంట్లో పోరాడమని కేసీఆర్ సూచించారని, కానీ కెసిఆర్ మాత్రం జాతీయ హోదా పై కేంద్రానికి దరఖాస్తు చేయలేదన్నారు. ఉద్యమ సమయంలో పనిచేసిన వారికి టీఆర్ఎస్లో గౌరవం లేదని, కొత్తగా చేరిన వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు.