సీఎం కేసీఆర్కు... అంబేద్కర్ కి నివాళులు అర్పించే అంత తీరిక లేదని కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి అన్నారు. నల్లగొండలోని కార్యక్రమంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు అంబేద్కర్కు నివాళులు అర్పిస్తుంటే, కేసీఆర్ మాత్రం అహంకారంతో ప్రగతి భవన్ లోనే ఉంటున్నారని కోమటిరెడ్డి విమర్శించారు. కేసీఆర్ వ్యవహరించిన తీరు సిగ్గుచేటు. ఈ అంశాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం’ అని ఆయన తెలిపారు.