అచ్చొచ్చిన విశాఖలో టీమిండియా సారథి విరాట్ కోహ్లీ దుమ్మురేపాడు. అద్భుతమై బ్యాటింగ్ ప్రతిభతో అరుదైన రికార్డ్ నెలకొల్పాడు. కెరీర్లో 10 వేల పరుగుల మైలురాయిని సాధించాడు. ఇంతకు ముందే భారత్లో వేగంగా 4వేల పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సాధించిన అతడు విండీస్పై అత్యధిక పరుగులు (1574) చేసిన భారత ప్లేయర్ గా నిలిచాడు.