పాకిస్థాన్లో ఏర్పాటుచేస్తున్న కర్తార్పుర్ నడవా భూమి పూజకు తప్పకుండా రావాలని దేశ విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్ మర్యాద పూర్వకంగా ఆహ్వనించారు. కాని సుష్మాస్వరాజ్ ఆ ఆహ్వానాన్ని తిరస్కరించారు. తన బదులు ఇద్దరు కేంద్రమంత్రులు హర్ సిమ్రత్ కౌర్ బదర్, హర్ దీప్ సింగ్పూరీ హాజరవుతారని తెలిపారు. పాక్ విదేశాంగ మంత్రి మహమూద్ ఖురేషీ ఆహ్వానిస్తూ ట్లీట్టర్లో పెట్టారు దాని సుష్మా స్పందిస్తూ నేనే మొట్టమొదలు ఒప్పుకున్న పనుల వల్ల నేను రాలేకపోతున్నా అని స్పష్టం చేశారు. భారత సిక్కు యాత్రికులు పాక్లోని గురుద్వారా దర్బార్ను దర్శించుకొనేందుకు సులభంగా వెళ్లడానికి ఈ నడవా ఉపయోగపడనుంది. నవంబరు 28న పాకిస్థాన్లో ప్రధాని ఇమ్రాన్ఖాన్ ఈ నడవాకు భూమిపూజ చేయనున్నారు.