జియోలో రూ.2లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టాం. 170 రోజుల్లోనే వంద మిలియన్లకు పైగా వినియోగదారులు జియోలో చేరారు. ప్రతి సెకనుకు ఏడుగురు కస్టమర్లను ఆకర్షిస్తున్నాం.జియో ఫేస్బుక్, వాట్సాప్ కంటే వేగంగా వృద్ధి చెందుతోంది.
అంతేకాదు ఫేస్బుక్, వాట్సాప్ కంటే జియోలోనే ఎక్కువగా బ్రౌస్ చేస్తున్నారు,జియో కస్టమర్లు నెలకు 250కోట్ల డేటాను వినియోగిస్తున్నారు. 165కోట్ల గంటల హైస్పీడ్ వీడియోలు చూస్తున్నారు. జియో రాకతో భారత్ డేటా వినియోగంలో అమెరికా, చైనాలను మించిపోయింది. జియోను వచ్చే 12 నెలల్లో 99శాతం జనాభాకు చేరువ చేస్తాం. దేశంలో వినియోగిస్తున్న 78కోట్ల ఫోన్లలో 50శాతం ఫీచర్ ఫోన్లే. వాటి వినియోగిస్తున్న వారికి డేటా కొరత రాకూడదన్న ఉద్దేశంతోనే అపరిమిత డేటా అందిస్తున్నాం.’ అని ముఖేశ్ అంబానీ వివరించారు.