ప్రజల ఆలోచన మేరకే పీపుల్స్‌ మేనిఫెస్టో: లక్ష్మీనారాయణ

Update: 2018-11-26 12:11 GMT

ప్రజల ఆలోచన మేరకే పీపుల్స్‌ మేనిఫెస్టో రూపొందించినట్లు సీబీఐ మాజీ జేడీ లక్ష్మి నారాయణ తెలిపారు. లోక్‌సత్తా పగ్గాలు చేపట్టాలని జయప్రకాశ్‌ నారాయణ ఆహ్వానించారని, పార్టీని ముందుండి నడిపించాలని కోరారని లక్ష్మినారాయణ తెలిపారు. ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. నేడు జేడీ లక్ష్మీనారాయణ సొంత పార్టీ ప్రకటిస్తాడని వచ్చిన వార్తలు తెలిసిందే. అనూహ్యంగా జేడీ లక్ష్మీనారాయణ లోక్ సత్తా పార్టీ గూటికి చేరారు. బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీల్లో చేరతారంటూ వచ్చిన పుకార్లు నేడు జేడీ లక్ష్మీనారాయణ స్వస్తి పలుకుతూ లోక్‌సత్తాలో చేరబోతున్ననంటూ జేడీ లక్ష్మీనారాయణ సోమవారం ప్రకటించారు. ఈ సందర్భంగా జయప్రకాశ్ నారాయణ్ మాట్లాడుతూ అధికారమంటే ప్రజలను దోచుకోవడం కాదని, దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం పనిచేయడమని వ్యాఖ్యానించారు.
 

Similar News