భవిష్యత్లో కమల్ హాసన్, రజనీకాంత్ తో కలిసి పనిచేస్తా...:పవన్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్న చెన్నై పర్యటనలో భాగంగా కమల్ హాసన్ తో సమావేశమైన సంగతి తెలిసిందే అయితే పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ భవిష్యత్తులో కమల్ హాసన్ స్థాపించి మక్కల్ నీది మయ్యం పార్టీతో పాటు తమిళ సూపర్ స్టార్, తమిళ తలైవా రజినీకాంత్తో కలిసి కట్టుగా పనిచేస్తనని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ప్రాంతీయపార్టీలు సమన్వయం, సహకారంతో పనిచేయకనే కేంద్ర సర్కార్ అడ్డగోలుగా రాష్ట్రాలుగా విభజించిందని పవన్ ఆరోపించారు. భావ సారూప్యత ఉన్న నేతలను కలుపుకుని పోవడంలో భాగంగానే కమల్ తో సమావేశం అయినట్లు వెల్లడించారు. బీజేపీ పార్టీ మనదేశాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తుందనే ఆశించి మద్దతు పలికననీ, కాగా ఇప్పుడు అది నెరవేరలేదని పవన్ వ్యాఖ్యానించారు. బీజేపీ పార్టీ తమ ఆశలు ఆరిఆశలు చేసిందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాబోయే రోజుల్లో కమల్, రజనీకాంత్ తో కలిసి ముందుకెళ్లే అంశాన్ని కొట్టిపారేయలేమని స్పష్టం చేశారు.