ఐపీఎల్ -11లో భారీగా పెరిగిన ప్రైజ్ మనీ

Update: 2018-05-26 10:50 GMT

ఐపీఎల్ 11వ సీజన్లో విన్నర్, రన్నర్స్ అప్ గా నిలిచే జట్ల కోసం భారీ ప్రైజ్ మనీ సిద్ధమయ్యింది. ముంబై వాంఖెడీ స్టేడియం వేదికగా జరిగే సూపర్ సండే టైటిల్ ఫైట్ లో విజేతగా నిలిచే జట్టుకు 26 కోట్ల రూపాయలు, రన్నర్స్ అప్ జట్టు కు 13 కోట్ల రూపాయలు ప్రైజ్ మనీగా  ఇస్తారు. గత సీజన్ విజేత ముంబై ఇండియన్స్ 15 కోట్ల రూపాయలు మాత్రమే విన్నర్స్ చెక్ అందుకొంది. 2018 ఐపీఎల్ ను మొత్తం 52 కోట్ల రూపాయల ప్రైజ్ మనీతో నిర్వహిస్తున్నారు. ఏడుసార్లు ఫైనలిస్ట్ చెన్నై సూపర్ కింగ్స్, రెండుసార్లు ఫైనలిస్ట్ హైదరాబాద్ సన్ రైజర్స్ జట్ల టైటిల్ సమరంలో ఏ జట్టు 26 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ జాక్ పాట్ కొడుతుందన్నదే ఇక్కడి అసలు పాయింట్.

Similar News