అరబ్ ఎమిరేట్స్ లో ఓ భారతీయుడికి కోట్లాది రూపాయల పంట పండింది. ఒకటి రెండు కాదు ఏకంగా 17 కోట్ల 50 లక్షల రూపాయల బంపర్ లాటరీ తగిలింది. అబుదాబిలో బహిష్కృత కేరళ కార్మికుడు కృష్ణన్ కుట్టి 500 దిరామ్ లతో లాటరీ టికెట్ కొన్నాడు. ఈ టికెట్ ఖరీదులో అతడి ముగ్గురు స్నేహితులు డబ్బులు షేర్ చేసుకున్నారు. కృష్ణన్ కుట్టికు బంపర్ లాటరీ తగిలింది. 17 కోట్ల 50 లక్షల రూపాయల ప్రైజ్ మనీ గెలుచుకున్నాడు. మొత్తం డబ్బులను తాను తీసుకోనని టికెట్ కొనుగోలులో డబ్బులు సాయం చేసిన ముగ్గురు ఫ్రెండ్స్ కు వాటా ఇస్తానని కృష్ణన్ కుట్టి చెప్పాడు.