దేశంలో అందరికీ శ్రీరాముడి పేరు పెట్టండి: హార్దిక్ పటేల్

Update: 2018-11-15 13:38 GMT

దేశంలో ఆకలి, నిరుద్యోగం, ఇతర ఆర్ధిక సమస్యలు, సామాజిక సమస్యలతో ప్రజలు కొట్టుమిట్టాడుతుంటే, భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రులు మాత్రం నగరాల పేర్లు మార్చడంలోనే నిమగ్నం అవుతున్నారని హార్దిక్ పటేల్  అన్నారు . తాజాగా ఉత్తరప్రదేశ్ లో  మొదలుపెట్టి  ఫయిజాబాద్ ను ఆయోధ్యగా, ఆలహాబాద్ ను కర్ణవతిగా, అలహాబాద్‌ ను ప్రయాగ్‌ రాజ్‌గా  శతబ్ధత కాలంగా ఉన్న పేర్ల మార్పుడి పై తాజా పటీదార్ ఉద్యమనేత హార్దిక్ పటేల్  తనదైన శైలిలో సమాధానమిచ్చారు. పేర్లు మార్చుకుంటపోతే సమస్యలు పరిష్కరం అనుకుంటే , భారతదేశంలో ఉండే ప్రతి ఒక్క భారతీయుడికి రాముడిగా పేరు నామకరణం చేయాలని బీజేపీ పై ఎద్దేవ చేశారు. నగరాల పేర్లు మార్చితే భారత దేశం బాగుపడుతుందని అనుకుంటే.. మొత్తం 125 కోట్లమంది భారతీయులకు శ్రీరాముడి పేరు పెట్టాలని వ్యగ్యాస్త్రం విసిరాడు. 

Similar News