వారిద్ద‌రూ ఉంటే ప్ర‌పంచ‌క‌ప్ భార‌త్‌దే: క‌పిల్‌

Update: 2018-03-02 11:31 GMT

రెండుసార్లు ప్రపంచ చాంపియన్ టీమిండియా 2019 ప్రపంచకప్ లో విజేతగా నిలవాలంటే విరాట్ కొహ్లీ దూకుడు, మహేంద్రసింగ్ ధోనీ నిబ్బరం ఎంతో అవసరమని భారత క్రికెట్ ఆల్ టైమ్ గ్రేట్ ఆల్ రౌండర్ కపిల్ దేవ్ అన్నారు. జట్టులోని ఆటగాళ్లంతా కొహ్లీ లాగా దూకుడుగా ఉన్నా లేక ధోనీలా కూల్ కూల్ గా ఉన్నా ప్రమాదమేనని హెచ్చరించారు. క్రికెట్ ఆట గురించి సంపూర్ణ అవగాహన ఉన్న ధోనీలాంటి ఒక్క ఆటగాడైనా జట్టులో ఉండితీరాలని చెప్పారు. ఇటీవలే ముగిసిన సౌతాఫ్రికా టూర్ లో టీమిండియా యువఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా అంచనాలకు తగ్గట్టుగా రాణించలేకపోడం ఆందోళన కలిగించిందని ఇంకనైనా పాండ్యా తన బ్యాటింగ్ లోపాలపై దృష్టి కేంద్రీకరిస్తే మంచిదని సలహా ఇచ్చారు.

Similar News